మిషన్ భగీరథ నీరు కలుషితం.. చర్మ వ్యాధులతో ప్రజలు అవస్థలు

ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో మిషన్ భగీరథ నీరు గత వారం రోజులుగా పూర్తిగా కలుషితమై వస్తున్నాయి.

Update: 2025-03-17 09:45 GMT
మిషన్ భగీరథ నీరు కలుషితం.. చర్మ వ్యాధులతో ప్రజలు అవస్థలు
  • whatsapp icon

దిశ,ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో మిషన్ భగీరథ నీరు గత వారం రోజులుగా పూర్తిగా కలుషితమై వస్తున్నాయి. దాంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరు కనీసం వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి కానీ, స్నానాలకు కానీ పనికి రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ మురుగు నీరు ఇతర అవసరాలకు ఉపయోగించడంతో ఒళ్లంతా దురద వస్తుందని పేర్కొంటున్నారు. విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని అందించాలని కోరుతున్నారు.   


Similar News