పకడ్బందీగా భూ సేకరణ నోటిఫికేషన్ః కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Update: 2024-08-23 09:34 GMT

దిశ, పెద్దపల్లిః ఎన్టీపీసీలోని తెలంగాణ పవర్ ప్లాంట్ స్టేజి-2 యాష్ డైక్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం సమీకృత కలెక్టరేట్ లో ఎన్టిపిసి భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో తెలంగాణ పవర్ ప్లాంట్ స్టేజి 2 యాష్ డైక్ నిర్మాణానికి అవసరమైన 600 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ భూ సేకరణ చట్టం 2013 ప్రకారం విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్టిపిసి ద్వారా టోపోగ్రాఫికల్, జియో టెక్నికల్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో ఇప్పటివరకు ఎన్టిపిసి సేకరించిన 9543 ఎకరాల భూమి మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డిఓ బి.గంగయ్య, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News