Karimnagar CP : గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు.

కరీంనగర్ లో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం జరగనున్న గణేష్ నిమజ్జన

Update: 2024-09-14 13:31 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్ లో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి కీలక సూచనలు చేశారు. శోభాయాత్ర రూట్ లు, నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు తో పాటు, పోలీసు పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పేర్కొన్నారు.

దీనిలో భాగంగా గణేష్ శోభాయాత్రలో డీజేల వినియోగంతో పాటు బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించామన్నారు. అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఆయుధాల ప్రదర్శన, ఇతరులను గాయపరిచే వస్తువులు కలిగివుండ రాదని, విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. ఈ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.


Similar News