Karimnagar CP : మిలాద్-ఉన్-నబీ ర్యాలీకి పటిష్ట బందోబస్తు..

మిలాద్-ఉన్-నబీ పండుగ వేడుకల్లో భాగంగా మర్కజి మిలాద్ కమిటీ

Update: 2024-09-19 14:07 GMT

దిశ,కరీంనగర్ : మిలాద్-ఉన్-నబీ పండుగ వేడుకల్లో భాగంగా మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముస్లింలు నగరం నందు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కరీంనగర్ హుస్సేన్ పుర బొంబాయి స్కూల్ మదర్సా నుండి ప్రారంభమై పాత బజార్ లో గల హజ్రత్ కరీముల్లా షా దర్గా వద్ద ముగుస్తుందని తెలిపారు. ఇదేరోజున సాయంత్రం నగరంలోని జ్యోతిబాపూలే మైదానంలో జల్సా కార్యక్రమం నిర్వహించుకుంటారని ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ, ఈ ర్యాలీ, జల్సా సమావేశం సందర్భంగా నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ముస్లింలు మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా ఎంతో పవిత్రంగా నిర్వహించే ర్యాలీలో గల మర్కజీ మిలాద్ కమిటీ సభ్యులకు, మతపెద్దలకు, ముస్లిం సోదరులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి శుభాకాంక్షలు తెలిపారు.


Similar News