District Collector Koya Shree Harsha : భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి..

సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై

Update: 2024-09-19 10:10 GMT

దిశ,పెద్దపల్లి : సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి పరిధిలో పెండింగ్ భూ సేకరణపై అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ,సింగరేణి కి సంబంధించి బుధవారం పేట గ్రామంలో 88 ఎకరాలు భూసేకరణ చేసి సింగరేణికి అప్పగించాల్సిన అవసరం ఉందని, అక్కడ భూ సేకరణకు సంబంధించి రికార్డుల అంశంలో సమస్యలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం పేట గ్రామంలో సర్వే నిర్వహించి భూసేకరణ సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంథని ఆర్డీవో హనుమ నాయక్, సింగరేణి, , రెవెన్యూ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News