హుజురాబాద్‌ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-07-16 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో చుట్టుపక్కనున్న వ్యాపారులు నష్టపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. 20 మంది వ్యాపారుల దుకాణాలు, అరటిపండ్ల బండ్లు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు ఫైర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. చిరు వ్యాపారులు మాట్లాడుతూ.. తాము అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో తమ జీవనోపాధి పోగొట్టుకున్నామని వాపోయారు. కాగా తమను ఆదుకోవాలని ఇరవై దుకాణాల చిరు వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Similar News