మేడిపల్లి గ్రామ శివారులో గంజాయి పట్టివేత..

ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-07-08 16:57 GMT

దిశ, మెట్ పల్లి/ ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అందులో రెండు ద్విచక్ర వాహనం పై నలుగురు వ్యక్తులు రాగా ఇద్దరు వ్యక్తులు పారిపోగా ఎస్సై అనిల్ తన సిబ్బందితో వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 750 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి నిందితులను విచారించగా ఆ నలుగురికి నాందేడ్ కి చెందిన మొహమ్మద్ అజార్ గంజాయి విక్రయించాడని తెలిపారు. అజార్ ని తీసుకురావడానికి మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు మెట్పల్లి ఎస్సై చిరంజీవి నాందేడ్ కు వెళ్లి అజార్ నీ అరెస్ట్ చేసి సోమవారం ఉదయం మెట్పల్లికి తీసుకొని వచ్చి రిమాండ్ కు తరలించమన్నారు. గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Similar News