ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి : సీఐ వేణుగోపాల్

ప్రతి ఒక్క వాహన దారుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ విధిగా

Update: 2024-07-07 11:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : ప్రతి ఒక్క వాహన దారుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ విధిగా నెంబర్ ప్లేట్లను మార్చుకోవాలని జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్ అన్నారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి 1:00 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్స్ లేని వాహనాలకు హెల్మెట్ ధరించిన వారికి ఫైన్ విధించారు. అదే విధంగా డాక్యుమెంట్స్ సరిగా లేని మరో 25 వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.


Similar News