ప్రజావాణిలో అధికారుల మధ్య వాగ్వివాదం..

ప్రజావాణికి లేట్ గా రావడానికి కారణం ఏంటని అడిగిన అడిషనల్ కలెక్టర్ కు తాను గ్రూప్ వన్ ఆఫీసర్ నే అంటూ జగిత్యాల బల్దియా కమిషనర్ సమ్మయ్య బదులిచ్చారు.

Update: 2024-10-07 15:58 GMT

దిశ, జగిత్యాల టౌన్: ప్రజావాణికి లేట్ గా రావడానికి కారణం ఏంటని అడిగిన అడిషనల్ కలెక్టర్ కు తాను గ్రూప్ వన్ ఆఫీసర్ నే అంటూ జగిత్యాల బల్దియా కమిషనర్ సమ్మయ్య బదులిచ్చారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో అడిషనల్ కలెక్టర్ రాంబాబు కమిషనర్ సమ్మయ్య ను ఆలస్యానికి గల కారణం అడిగారు. ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కమిషనర్ బదులిస్తూ మున్సిపాలిటీలో వందల కేసులు పెండింగ్లో ఉన్నాయని అది కాక తను ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరవ్వడం తోనే ఆలస్యమైందని తెలిపారు. తను కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ నే అని అడిషనల్ కలెక్టర్ తో కమిషనర్ సమ్మయ్య చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా అధికారుల మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకోగా అక్కడున్న మిగతా అధికారులు విస్తుపోయారు.


Similar News