ఎస్సారెస్పీ నీటి కాలువలో పడి రైతు మృతి

శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం నీటి కాలువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

Update: 2024-10-07 14:59 GMT

 దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం నీటి కాలువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి వీరయ్య(50 )ఆదివారం ఆవుకు పచ్చి గడ్డి కోసుకు రావడానికి వెళ్లి.. గడ్డి కోసుకొని తనకున్న ద్విచక్ర వాహనంపై పెట్టుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనున్న ఎస్ ఆర్ ఎస్ పి డీబీఎం 15 కాలువలో పడిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పలు చోట్ల వెతికినా కనిపించలేదు అని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పొలాల్లోకి వెళ్లే రైతులు గ్రహించి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీటి నుండి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపాడు.


Similar News