మొబైల్ టిఫిన్ ఆటోని ఢీ కొట్టిన లారీ

సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-01-03 07:18 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ అర్బన్ మండలంలోని తిట్టకుంటకు చెందిన భూప్పరాజు శ్రీకాంత్ రమాదేవి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజువారి పనుల్లో భాగంగా బుధవారం ఉదయం తేట్టకుండా నుండి టిఫిన్ సెంటర్ ఆటో సిరిసిల్ల వైపు వస్తుంది. ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది దీనిలో టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రమాదేవి, శ్రీకాంత్ లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానికులు 108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Similar News