నిన్ననే విదేశాల నుంచి ఇంటికొచ్చిన భర్త.. భార్యను దారుణంగా హత్య చేశాడు

భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావు పేట లో జరిగింది.

Update: 2024-07-08 04:09 GMT

దిశ,  మేడిపల్లి: భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావు పేట లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాయంచు జల (45 ) ను నిద్రిస్తున్న సమయంలో భర్త లింగం ఇంట్లో ఉన్న పారాతో తలపై కొట్టి అతి కిరాతంగా హత్య చేశాడు. అనంతరం లింగం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. నిందితుడు లింగం పోలీసులకు లొంగిపోవడంతో చికిత్స నిమిత్తం జగిత్యాలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియనున్నాయి. ఇది ఇలా ఉండగా నిందితుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి తన స్వగృహానికి వచ్చాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా కుమారుడు గల్ఫ్‌లో ఉంటున్నాడు.


Similar News