క్రీడాకారులకు అండగా ఉంటాం : వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు.

Update: 2024-08-28 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన పార ఒలింపిక్స్ పారిస్–2024 కు సెలక్టైన జీవన్ దీప్తిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 400 మీటర్ల పరుగు పందెంకు పోటీలో విజయం సాధించాలని కోరారు. బంగారు పథకాన్ని సాధించి దేశ, రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం తరపున పారిస్ కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సింగారపుబాబు, సంజీవయ్య, గాడిపల్లి ప్రశాంత్ ,నరేష్ యాదవ్,నూక రాజు, సైదులు, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News