వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉండొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2024-08-27 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉండొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు పార్టీ చీకటి ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ మంజూరు అయిందని ఆరోపించారు. కవితకు బెయిల్ వస్తుందని మూడు నాలుగు రోజుల నుంచే ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులు తీర్పు ఇవ్వకముందే వీళ్లు బెయిల్ వస్తుందని ఫిక్స్ అయిపోయారని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పటినుంచో ఒప్పందంలో ఉన్నాయని తెలిపారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించిందని విమర్శించారు. కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ అలా చేసిందని అన్నారు. కవిత బెయిల్ విషయంలో ఇది మరోసారి రుజువైందని చెప్పారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కవిత కోసమే వదులుకున్నారని అన్నారు.


Similar News