‘అందుకే ఓడిపోయా’.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో

Update: 2024-07-01 17:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను చేసిన సేవలు ప్రజలు మర్చిపోయారని.. అందుకే తనను ఎన్నికల్లో ఓడించారని అన్నారు. కానీ తాను ఓట్ల కోసం సేవ చేయనని.. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలే నాకు ముఖ్యమన్నారు. కానీ నేను ప్రజలకు అందుబాటులో ఉండనని సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రచారం చేయడం బాధ కలిగించిదన్నారు. కాగా, గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగిన జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ క్యాండిడేట్ చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చినప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓటమి పాలు కావడంతో జగ్గారెడ్డికి మంత్రి పదవి మిస్ అయ్యింది. దీంతో జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Similar News