భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కీలక సూచన

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యో గులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు .

Update: 2024-09-01 05:39 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యో గులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు . ముందస్తుగా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే సహాయక చర్యలలో భాగస్వాములు కావాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ తగు సలహాలు, సూచనలు వారి నుంచి తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు.


Similar News