TSSPDCL: విద్యుత్ సంస్థల ఎదుగుదల ఓర్వలేక కుట్ర.. తప్పిన పెను ప్రమాదం!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఆసక్తికర ట్వీట్ చేసింది. బరితెగించిన దుర్మార్గులు అంటూ టీఎస్ఎస్‌పీడీసీఎల్ విమర్శించింది.

Update: 2024-05-12 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఆసక్తికర ట్వీట్ చేసింది. బరితెగించిన దుర్మార్గులు అంటూ టీఎస్ఎస్‌పీడీసీఎల్ విమర్శించింది. మియాపూర్ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్ లోని 220/132/33 కెవి కేబుల్‌ని ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున దుండగులు తగులబెట్టారని కాలిపోయిన కేబుల్ ఫోటో‌ను పోస్ట్ చేసింది. విద్యుత్ సంస్థల ఎదుగుదలను ఓర్వలేక, సంస్థను ఇబ్బందులకు గురి చేయాలని దుర్మార్గులు కుట్రలు పన్నారని పేర్కొంది.

సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ట్వీట్ చేసింది. దారుణం, దుర్మార్గులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News