తెలంగాణలో మరోసారి ఐటీ పంజా.. న్యూస్ చానల్ యజమాని ఇంట్లో తనిఖీలు

తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు(IT officials) పంజా విసిరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.

Update: 2024-09-24 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు(IT officials) పంజా విసిరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. కూకట్‌పల్లిలోని సమీపంలోని మూసాపేట్(Musapate) రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌(Rainbow Vistas Apartment)లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్‌లోని ‘ఐ బ్లాక్’‌లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్‌తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు సమాచారం.


Similar News