HYDRA: హైడ్రాపై మరోసారి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘హైడ్రా’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-09 17:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తోందని అన్నారు. అలాగే ఏపీలోనూ బుడమేరు ఆక్రమణలతో కాలనీలకు కాలనీలే నీట మునిగాయని గుర్తు చేశారు. కానీ, చెరువులను ఆక్రమించి నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు తెలిసో, తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలోనే వారికి పునరావాసం కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని సూచించారు. బాధితుల సమస్యలను పూర్తిగా విన్నాకే వాళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టాలన్నది తన పర్సనల్ ఒపీనియన్ అని అన్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను తాను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. 


Similar News