Errabelli Dayakar Rao : వాళ్ల డైరెక్షన్‌లో CM రేవంత్ నడవట్లేదు..

దీపావళికి ముందే తెలంగాణ పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) స్పందించారు.

Update: 2024-10-26 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళికి ముందే తెలంగాణ పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లోనే దీపావళికి ముందు బాంబులు పేలుతాయని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి ఆ పార్టీకి ముప్పు పొంచి ఉందని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని సీనియర్లకు సీఎం రేవంత్(CM Revanth Reddy), మంత్రి పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) పెత్తనం నచ్చడం లేదని అన్నారు.

సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల అపాయింట్మెంట్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి దొరకడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడవటం లేదని అన్నారు. పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌కు వస్తున్న ముప్పును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముందుగానే పసిగట్టారని అన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదారి అయ్యారని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు.

 

Tags:    

Similar News