ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా వదలం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-27 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా.. ఎవరైనా వదలబోమని.. అందరికీ ఒకటే రూల్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులు రోడ్డున పడకూడదని మత్రమే ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అకడమిక్ ఇయర్ మధ్యలో అక్రమంగా నిర్మించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటే విద్యార్థులకే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కచ్చితంగా అక్రమ కట్టడాలే అయితే.. తొలగించేందుకు వారికే సమయం ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు రంగనాథ్‌ను కలిశారు. ఒవైసీ బ్రదర్స్ చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఫిర్యాదు చేశారు. హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ధర్నా చేస్తామని అన్నారు. బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైవిధంగా స్పందించారు.


Similar News