రోడ్డు ప్రమాదంలో యువతి మృతి..

Update: 2024-08-26 16:31 GMT

దిశ, ఖైరతాబాద్ః పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బేగంపేట్ ఫ్లైఓవర్ వద్ద ఎస్పీఎఫ్ లో ఎస్సైగా పనిచేస్తున్న శంకర్ రావు తన కూతుర్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా వెనకాల నుండి వచ్చిన టెంపో వాహనం ఢీకొట్టింది. దాంతో కింద పడిపోయిన ప్రసన్న (25) తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News