అర్హులైన జర్నలిస్టులకు ఇండస్థలాలు కల్పిస్తాం

రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 100 శాతం ప్రయత్నిస్తానని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-02 14:16 GMT

దిశ, హిమాయత్ నగర్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు 100 శాతం ప్రయత్నిస్తానని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన కె. శ్రీనివాస్ రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్ గా ఉద్యోగ విరమణ చేసిన కె. రవికాంత్ రెడ్డి, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోపరేటివ్ ఏంఏ హౌసింగ్ సొసైటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బొమ్మగాని కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కె. విరహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శిలు వరకల

    యాదగిరి, కోశాధికారి ఎం. వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. అనిల్ కుమార్, రాజేష్, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్ లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంఖ్య మీడియాలో వస్తున్న మార్పులతో తగ్గిపోనున్నదని చెప్పారు. జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్ లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. జర్నలిజానికి గౌరవం రావాలంటే అక్రిడేషన్ అవసరం అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 22,000 మందికి అక్రిడేషన్ లు ఉన్నాయన్నారు. ఒక హైదరాబాదులోనే 4,500 మంది ఉన్నారని చెప్పారు.

    అక్రిడేషన్లు అర్హులకు మాత్రమే అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామని అన్నారు. మండల జిల్లా, రాష్ట్ర స్థాయిలలో గుర్తించి స్థలాలు ఇస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ను అనుసరించి ఇళ్ల స్థలాలను జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోపరేటివ్ ఎంఏ హౌసింగ్ సొసైటీ కి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం సిద్ధంగా ఉన్నారని, అతిత్వరలో అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ

    జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఐజేయూ నేత వై. నరేందర్ రెడ్డి, హెచ్ జే యూ ప్రధాన కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, ప్రముఖ సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్, తెలంగాణ రాష్ట్రం ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి బి.హెచ్.ఏం.కె. గాంధీ, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, ఎంఏ. సర్వర్, ఎండీ. ఏలిముద్దీన్, పి. హరికృష్ణ, పి. మోహన చారి, నగర గోపాల్, ఏ. మహేష్ కుమార్, ఎన్. శివ కుమార్, నేతలు శ్రీధర్, విజయ్, చారి, సుమన్ రెడ్డి, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు

Similar News