చేతి గాయానికి చికిత్స.. ఏఐజీ హాస్పిటల్కు హరీశ్రావు
సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్రావు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్రావు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు హరీశ్ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తన చేయికి గాయం అయిందని, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు బయటకు వెళ్లాలని పోలీసులకు తెలిపారు. అయినా ఆయనను పోలీసులు అడ్డుకోగా హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయలైనా చికిత్స పొందే హక్కు తనకు లేదా అని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు దగ్గరుండి మరీ ఆయనను గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.