'మీరు నేర్పిన పాఠాలు.. క్రమశిక్షణ.. మాకు దీవెనలు..'
టీచర్స్ నేర్పిన పాఠాలు, క్రమశిక్షణతో తమ జీవితం ఇప్పుడు సంతోషంగా కొనసాగుతుందని ప్రబోధ్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.

దిశ, సిటీ క్రైమ్ : టీచర్స్ నేర్పిన పాఠాలు, క్రమశిక్షణతో తమ జీవితం ఇప్పుడు సంతోషంగా కొనసాగుతుందని ప్రబోధ్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు. 20 ఏండ్ల తర్వాత 2008 బ్యాచ్ కు చెందిన 60 మంది విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ రహీంపుర ప్రబోధ్ స్కూల్ లో కలిశారు. తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన టీచర్ లను పూర్వ విద్యార్థులు సన్మానించారు. తమ టీచర్ లు నేర్పిన బుద్ధులతో ప్రభుత్వ, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించామన్నారు. తమ విద్యార్థులు ఉన్నత స్థానంలో స్థిరపడడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పూర్వవిద్యార్థుల గురువులు అన్నారు.