ఓపెన్ జిమ్ లను సద్వినియోగం చేసుకోవాలి

ఓపెన్ జిమ్ లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Update: 2024-10-11 11:50 GMT

దిశ, సికింద్రాబాద్ : ఓపెన్ జిమ్ లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సీతాఫల్మండిలోని బీదల బస్తీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను శుక్రవారం కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకొని, ఆరోగ్యంగా జీవించాలన్నారు. ఇది వ్యాయామం ద్వారానే సాధ్యమని సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

    అనంతరం నామాలగుండులోని వీరాంజనేయ స్వామి ఆలయంలోని దుర్గామాతకు, కట్ట మైసమ్మ నల్లపోచమ్మ ఆలయంలోని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, కందటి నాగేశ్వర్ రెడ్డి,వేణు యాదవ్, పోచయ్య, రవి ప్రసాద్ గౌడ్, భాస్కర్ గిరి, ప్రభు గుప్తా, మేకల కీర్తి హర్ష కిరణ్, శారదా మల్లేష్, వీరన్న, శ్యామ్, డివిజన్ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు, హనుమంతు ముదిరాజ్, రాము వర్మ, కొల్లి నాగేశ్వరరావు,సేతు మహేష్, అనూష, మంజుల తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News