Momos Incident : మోమోస్ ఘటన.. సంస్థను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్‌ (Hyderabad)లో మోమోస్ (Momos) తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-10-28 12:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ (Hyderabad)లో మోమోస్ (Momos) తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో జీహెచ్ఎంసీ సీరియస్ అయ్యింది. మోమోస్ తయారు చేసిన సంస్థను అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్‌ (Banjarahills)లోని నందినగర్‌లో మోమోస్ తిని అనారోగ్యం పాలై ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన మోమోస్ ను చింతల్ బస్తీలో తయారు చేసినట్టు గుర్తించిన పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని, మోమోస్ తయారీకి నాసిరకం ఉత్పత్తులు వాడటమే కాకుండా.. స్టోరేజ్ చేసిన మోమోస్ ను అమ్మడం ద్వారా.. అవి తిన్న వారికి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Tags:    

Similar News