మిలాద్-ఉన్​-నబీ ర్యాలీలో అపశృతి..టపాసులు కాల్చుతుండగా ప్రమాదం

మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా గురువారం

Update: 2024-09-19 16:34 GMT

దిశ, చార్మినార్​ : మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా గురువారం చారిత్రాత్మక చార్మినార్​ వద్ద నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా హైదరాబాద్​ పాతబస్తీలో చార్మినార్​ వద్ద ఆల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి ర్యాలీలు నిర్వహించారు. గురువారం రాత్రి సమయంలో ఆటోలో డీజేతో పాటు జనరేటర్​ ఉండగా అదే ప్రాంతంలో కొందరు యువకులు టపాసులు కాల్చారు.

ఒక్కసారిగా నిప్పురవ్వలు జనరేటర్​ మీద పడడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి యువకులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్​ వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్​ ఇంజన్​ ద్వారా అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Similar News