మెట్రో పోలీస్ హోటల్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ లోని మెట్రో పోలీస్ హోటల్ ను ఖాళీ చేయించి హోటల్ ను సీజ్ చేసినట్లు సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ తెలిపారు.

Update: 2024-10-17 15:11 GMT

దిశ, బేగంపేట: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ లోని మెట్రో పోలీస్ హోటల్ ను ఖాళీ చేయించి హోటల్ ను సీజ్ చేసినట్లు సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ తెలిపారు. గత సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఇదే హోటల్ నుంచి అస్లాం అనే దుండగుడు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని ఎమ్మార్వో తెలిపారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ సికింద్రాబాద్ ఆర్డీవో ను ఆదేశించడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి హోటల్ ను సీజ్ చేసినట్లు ఎమ్మార్వో పాండు నాయక్ తెలిపారు.హోటల్లో గత కొంతకాలంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా పెద్ద ఎత్తున మతపరమైన బోధనలు ఇల్లీగల్ గా శిక్షణా తరగతులు..మీటింగ్స్ జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారని, అందుకే హోటల్ సీజ్ చేసినట్లు ఎమ్మార్వో పాండు నాయక్ తెలిపారు. ఎమ్మార్వో తో పాటు డిప్యూటీ ఎమ్మార్వో రజనీ యాదవ్ ఉన్నారు.


Similar News