Secunderabad: ముత్యాలమ్మ ఆలయంలో అఘోరా ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో ఒంటికాలుపై నిల్చుని అఘోరా ప్రత్యేక పూజలు చేశారు..

Update: 2024-10-17 15:29 GMT

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడి(Mutyalamma temple)లో నాలుగు రోజుల క్రితం అమ్మవారి విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం అఘోరా(Agora) సందర్శించారు. ఒంటికాలుపై నిల్చుని ప్రత్యేక పూజలు(Special Pujas) చేశారు. మరోవైపు ఆలయంలో సంప్రోక్షణ కొనసాగుతోంది. ఈ సమయంలో అఘోరా ఆలయానికి రావడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు(BJP leaders), హిందూ సంఘాలు(Hindu communities) మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి వెనుకున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 


Similar News