ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మార్గం…
ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉదయం 7 గంటలకు కదలనున్నాడు
దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉదయం 7 గంటలకు కదలనున్నాడు. ఖైరతాబాద్ నుంచి రాజ్ దూత్ హోటల్(లక్షీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి గణనాథుడి శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.