పప్పులో జెర్రి ప్రత్యక్షం..

హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్ లో

Update: 2024-09-24 14:36 GMT

దిశ,కార్వాన్ : హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్ లో పప్పులో జెర్రీ ప్రత్యక్షమైంది. ఓ వ్యక్తి సోమవారం అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్ కి వెళ్ళి తాలి ఆర్డర్ చేసాడు. సగం తిన్నాక పప్పులో జెర్రీ ప్రత్యక్షమైంది. బాధితుడు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు. అపరిశుభ్రమైన ఆహారాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్య ఫుడ్ సేఫ్టీ అధికారి..

పప్పులో జెర్రీ వచ్చిందని మధ్యాహ్నం ఫిర్యాదు వచ్చింది.వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు తరలించాము.త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.


Similar News