హెచ్ ఎండీఏ అధికారులు కూల్చివేతకు యత్నం..వ్యక్తి ఆత్మహత్యాయత్నం

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ డివిజన్ ఎంఏ

Update: 2024-09-21 12:14 GMT

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు హెచ్ ఎండీఏ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శనివారం ఎంఏ నగర్ లో కూల్చివేతలు చేపట్టేందుకు హెచ్ ఎండీఏ అధికారులు సిబ్బందితో కలిసి ఎంఏ నగర్ కు చేరుకున్నారు. కూల్చివేతలు చేపట్టకుండా స్థానికులు అడ్డుపడ్డారు. తమ ఇళ్ల జోలికి వస్తున్నారని ఆక్షేపిస్తూ దుర్గయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆయనను వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గయ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎంఏ నగర్ లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన నిర్మాణాలను కూల్చేందుకు హెచ్ ఎండీఏ అధికారులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం హెచ్ ఎండీఏ అధికారులు మరోసారి కూల్చివేతలకు సిద్ధమయ్యారు. అయితే ఎంఏ నగర్ కూల్చివేతలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు కొందరికి కొమ్ము కాస్తున్నారని, కొందరి నిర్మాణాల పట్ల చూసీచూడనట్టు ఉంటున్నారని, ఇంకొంత మంది విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.


Similar News