భారీగా గంజాయి స్వాధీనం…నలుగురిపై కేసు నమోదు

ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో దూల్పేట్ జుమేరాద్ బజార్ సమీపంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న దంపతులను సోమ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-16 15:45 GMT

దిశ,కార్వాన్ : ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో దూల్పేట్ జుమేరాద్ బజార్ సమీపంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న దంపతులను సోమ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2.168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జుమేరాద్ బజార్ సంతోషి మాత టెంపుల్ సమీపంలో లోయర్ దూల్పేట్ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు అంజిరెడ్డి టీం తనిఖీలు నిర్వహిస్తుండగా మహేందర్ సింగ్, సునీత భాయ్ భార్యాభర్తలు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని తనిఖీ చేసి వారి వద్ద ఉన్న 2.168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు దుర్గేష్ ,అంగూర్ భాయ్ అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ మధు బాబు ఉన్నారు.


Similar News