గణేశ్ నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్న సీఎం.. సచివాలయం నుంచి కాలినడకన..

ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు...

Update: 2024-09-17 05:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ గణనాథుడు కాసేపట్లో ట్యాంక్ బండ్‌ వద్ద హుస్సేర్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.  సెక్రటేరియట్ నుంచి ఇప్పటికే ఆయన కాలినడకన ట్యాంక్ బండ్‌ వద్దకు చేరుకున్నారు. గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. బొజ్జగణపతి నిమజ్జనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మహా గణపయ్య శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి లక్డికాపూల్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు  కొనసాగుతోంది. వేలాది మంది భక్తుల మధ్యన శోభాయాత్ర ముందుకు సాగుతోంది. దీంతో సెక్రటేరియట్  టు ట్యాంక్ బండ్ వైపు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.


Similar News