BRS , Congress కార్యకర్తలు బాహాబాహి

వైఎస్సార్ నగర్ కాలనీలో ఫేస్ టు లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.

Update: 2023-10-03 16:44 GMT

దిశ, ఖమ్మం సిటీ : వైఎస్సార్ నగర్ కాలనీలో ఫేస్ టు లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల జోక్యంతో అక్కడ ఒకరిపై ఒక దాడులు చేసుకోవడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చిన్నపాటి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తలకు కూడా గాయం అవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంపై స్పందిస్తూ అధికార పార్టీ వారు కావాలని తమ కార్యకర్తలపై దాడులు చేయించారంటూ ఆరోపించారు.

Tags:    

Similar News