ట్రాఫిక్ ​సిగ్నల్ వద్ద ఆగిన ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

ట్రాఫిక్ ​సిగ్నల్ పాయింట్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన బహదూర్​పురా పోలీస్​స్టేషన్​పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-09-25 10:21 GMT

దిశ, చార్మినార్: ట్రాఫిక్ ​సిగ్నల్ పాయింట్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన బహదూర్​పురా పోలీస్​స్టేషన్​పరిధిలో చోటు చేసుకుంది. బహదూర్​పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్​ఆటో ముగ్గురు ప్రయాణీకులను ఎక్కించుకుని జూపార్కు నుంచి పురానాఫూల్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో బహదూర్​పురా చౌరస్తా వద్ద ట్రాఫిక్​సిగ్నల్ వద్ద రెడ్​సింబల్​పడడంతో ఆగింది.

95 (ఆర్) ​రూట్ ​రాజేంద్ర నగర్ ​నుంచి కోఠికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ట్రాఫిక్​ సిగ్నల్​వద్ద ఆగిఉన్న ప్యాసింజర్​ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్​ఆటో ముందుకు వెళ్ళి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్యాసింజర్​ఆటోలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్​ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News