సరస్వతి దేవి అలంకరణలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

శరన్నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో

Update: 2024-10-09 13:20 GMT

దిశ, జూబ్లీహిల్స్: శరన్నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో బుధవారం , ఏడో రోజు అంటే ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చదువు, విజ్ఞానం, సంగీతం, కళలకు దేవతగా సరస్వతి దేవిని భక్తితో కొలుస్తారు. అధిక సంఖ్యలో భక్తులు, విద్యార్దులు కనులు విందుగా అలంకరించిన సరస్వతి దేవి నీ దర్శించించుకుని , పూజల్లో పాల్గొన్నారు.


Similar News