నడుస్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..

మియాపూర్ మెట్రో స్టేషన్ కింద శనివారం సాయంత్రం భారీ

Update: 2024-10-19 14:10 GMT

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ మెట్రో స్టేషన్ కింద శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్ వైపు నుండి కూకట్ పల్లి వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వెంటనే కారును పక్కన ఆపేయడంతో అందులో ఉన్న వారు దిగిపోయారు. మెట్రో స్టేషన్ వద్దనే నడి రోడ్డుపైనే భారీ అగ్ని ప్రమాదం జరగడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబై, హైదరాబాద్ హైవే పై అగ్నిప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చందానగర్ నుండి పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఇంజన్ లో తలెత్తిన లోపాల, మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది.


Similar News