TG News: రూ. 29 కోట్ల మోసం.. A3గా బీఆర్ఎస్ ఏపీ మాజీ అధ్యక్షుడు

బీఆర్ఎస్ ఏపీ మాజీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌‌పై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ..

Update: 2024-09-21 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఏపీ మాజీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ (BRS Ap Former President Chandrasekhar)పై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ (Aditya Constructions) యజమాని చంద్రశేఖర్ రూ. 29 కోట్ల మేర మోసం చేశారని వాకాడ తిరుమలరావు (Vakada Tirumala Rao) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 220 ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చేలా గతంలో ఆదిత్య, తిరుమల కన్‌స్ట్రక్షన్స్(Tirumala Constructions) ఒప్పందం చేసుకున్నాయని, ఇందుకోసం తాను రూ. 50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టానని తిరుమల రావు తెలిపారు. అయితే  బిల్లులు ఇవ్వాలని అడిగితే.. చంద్రశేఖర్ తన వద్ద ఉన్న బౌన్సర్లతో దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలరావు ఫిర్యాదు మేరకు ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితుల్లో ఏ3గా తోట చంద్రశేఖర్‌ను చేర్చారు. 


Similar News