Suicide: : ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో విషాదం.. ఫ్యానుకు ఉరివేసుకొని జీవిత ఖైదు ఆత్మహత్య

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విషాదమైన ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-08-30 20:09 GMT

దిశ, వెబ్‌డెస్క్:  బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి వైద్యం నిమిత్తం తరలించిన జీవిత ఖైదు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పి.ప్రశాంత్ (28) అనే వ్యక్తి గతంలో ఒక కేసులో నేరారోపణ ఋజువు అవ్వటంతో , డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి జీవిత ఖైదీ కింద శిక్ష విధించింది. అధికారులు అతన్ని జనవరి నెలలో ఆసిఫాబాద్ లోని డిస్ట్రిక్ట్ జైలు నుండి చంచల్ గూడ జైలుకుతరలించారు. అయితే అక్కడ మానసిక స్థితి సరిగా లేకపోవటంతో ప్రశాంత్ ని ఆగస్టు 22 వ తేదీన , ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించారు. కారణం ఏమైందో తెలియదు కానీ ప్రశాంత్ శుక్రవారం ఆసుపత్రిలో ఓ గదిలో ఫ్యానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్న కాసేపటి తరువాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న బోరబండ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Similar News