రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం..
వరంగల్ జిల్లా మామునూరులో జ్యోతిబాపూలే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరగగా హోంగార్డు దుర్మరణం పాలయ్యాడు.
దిశ, వరంగల్ : వరంగల్ జిల్లా మామునూరులో జ్యోతిబాపూలే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరగగా హోంగార్డు దుర్మరణం పాలయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు సుధాకర్ మృతి చెందాడు. మామూనూరు పోలీసు స్టేషన్కు విధులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.