GO 33: రేవంత్ రెడ్డి సర్కార్ కు బిగ్ రిలీఫ్..జీవో 33ను సమర్థించిన హైకోర్టు

రేవంత్ రెడ్డి సర్కార్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది.

Update: 2024-09-05 09:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జారీ చేసిన జీవో 33 విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన జీవో 33ను హైకోర్టు సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు విద్యార్థుల స్థానికత(జీవో 33)పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా కాదా అన్నది పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం ప్రస్తుతం మార్గదర్శకాలు లేనందున కొత్తగా రూపొందించుకుని వాటిని పాటించాలని కాలోజీ వర్సిటీకీ హైకోర్టు ఆదేశించింది. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఇతర ఎవరైనా తెలంగాణలో ఇంటర్, దానికి ముందు రెండేళ్లు తెలంగాణలో చదివితే వారకి స్థానిక కోటా వర్తింపజేయండ అన్యాయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం కలుగుతుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్థించింది.


Similar News