‘ఎల్లమ్మ తల్లి కాపాడాలి’.. తెలంగాణ ప్రజలకు గవర్నర్ బోనాల శుభాకాంక్షలు

తెలంగాణలో ఆషాడ బోనాల సందడి షూరు అయ్యింది. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

Update: 2024-07-07 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆషాడ బోనాల సందడి షూరు అయ్యింది. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర ప్రజలను వ్యాధుల నుండి ఎల్లమ్మ తల్లి కాపాడాలని ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుండి మొదలైన ఆషాడ బోనాలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. 


Similar News