కాంగ్రెస్‌లో చేరిన GHMC మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2024-03-30 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 150 వార్డుల్లో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత ఆ సంఖ్య 11కు చేరింది. ఇవాళ మేయర్‌ చేరికతో అది కాస్త 12కు చేరింది. ఈ  చేరిక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News