టీ.బీజేపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే తల్లి కన్నుమూత

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ కీలక నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తల్లి అనసూర్యమ్మ కన్నుమూశారు.

Update: 2024-05-28 12:16 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ కీలక నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తల్లి అనసూర్యమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని వారి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. భగవంతుడు రామచంద్రారెడ్డికి ధైర్యం ప్రసాదించాలని వేడుకుంటున్నారు.



 


Tags:    

Similar News