మీరు మాకు నీతులు చెప్పొద్దు.. బీఆర్ఎస్ నేతలపై మాజీ ఎమ్మెల్యే సీరియస్

కవిత లిక్కర్ స్కాం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Update: 2023-03-11 13:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కవిత లిక్కర్ స్కాం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కవితపై బండి సంజయ్ చేసిన యాస, భాషను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ తలదించుకునేలా మాట్లాడతారని, అలాంటి వ్యక్తులు మాకు నీతులు చెప్పాల్సిన అక్కర్లేదని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Tags:    

Similar News