మాజీ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కుటుంబంలో తీవ్ర విషాదం

మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది. రాజయ్యకు వరుసకు వదిన అయిన తిప్పారపు జయమ్మ మృతి చెందారు.

Update: 2024-06-28 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది. రాజయ్యకు వరుసకు వదిన అయిన తిప్పారపు జయమ్మ మృతి చెందారు. జయమ్మది రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం. ఆమె సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. జయమ్మ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో తాటికొండ రాజయ్య ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. జయమ్మ డాక్టర్ రాజయ్యకు సమీప బంధువలే కాకుండా వదిన వరుస అవుతారు. కాగా, ఈ రోజు సాయంత్రం జయమ్మ అంత్యక్రియలను ఆమె స్వగ్రామం నిడిగొండలో నిర్వహించనున్నారు.


Similar News