BJP: తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. కేంద్రంలో ఈటల, అర్వింద్ కు కీలక పదవులు

తెలంగాణ బీజేపీ ఎంపీలకు కీలక అవకాశం వరించింది.

Update: 2024-10-08 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీలో ఈటల రాజేందర్ కు కీలక స్థానం దక్కింది. ఈ కమిటీ చైర్మన్ గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు స్పీకర్ ఆమోదంతో లోక్ సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. తెలుగు ఎంపీల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సభ్యుడిగా ఛాన్స్ దక్కింది.


Similar News