డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి.. 24,454 మంది హాజరు

రాష్ట్రంలోని 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది.

Update: 2024-10-05 17:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున మొత్తం 25,622 మందిని వెరిఫికేషన్ కోసం విద్యాశాఖ పిలిచింది. కాగా ఈ ప్రక్రియకు మొత్తం 24,454 మంది హాజరయ్యారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి 18 జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా, అందులోని ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా, వారికి ఆదివారం నిర్వహించనున్నారు. అయితే ఈనెల 9న ఎల్‌బీ స్టేడియంలో డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.


Similar News